మురికివాడల్లో నివసించే పేద,బడుగు,బలహీన వర్గాల మహిళలు ఆర్థిక స్థోమత లేక ఋతుక్రమ సమయంలో అపరిశుభ్రమైన క్లాత్ లను వాడడం వల్ల వారు అనారోగ్య పాలవుతున్నారని విన్నపం ఒక పోరాటం స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షురాలు చీకూరి లీలావతి అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ గోపాలపురం గ్రామానికి చెందిన విన్నపం ఒక పోరాటం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షురాలు చీకూరి లీలావతి ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్యకి ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు.
తాము చేస్తున్న విన్నపం ఒక పోరాటం కి మద్దతివ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిసి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడేపల్లి కృష్ణమాచారి కూడా పాల్గొన్నారు. సంపన్న వర్గాల మహిళలు ఋతుక్రమ సమయంలో సానిటరీ పాడ్స్ కెమికల్స్ తో తయారు చేసేవి వాడటం వల్ల అనేక రకాలైన అనారోగ సమస్యలతో క్యాన్సర్ బారిన పడి చాలామంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారని ఆమె వివరించారు.
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల ప్రాణాలతో ఆడుకోకుండా కెమికల్ రహిత స్నాప్కిన్ తయారు చేసి ఉచితంగా అందించాలని వివరించారు. అందుకు ఆర్.కృష్ణయ్య విన్నపం ఒక పోరాటానికి ఎల్లవేళలా పూర్తి మద్దతు ఉంటుందని తెలియజేసినట్లు చీకూరి లీలావతి తెలిపారు. ఈ కార్యక్రమంలో జయంతి,దీప, పూజ,విజయలక్ష్మి,లత తదితర మహిళలు పాల్గొన్నారు.