31.2 C
Hyderabad
May 3, 2024 00: 15 AM
Slider గుంటూరు

మైనర్ బాలికపై టీచర్ అత్యాచారం…?

#rape

ముక్కు పచ్చలారని 8 ఏళ్ల మైనర్ బాలికపై ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయుడు, మరొక బాలుడు కలసి అత్యాచారానికి ఓడి కట్టిన  దారుణ ఘటన పల్నాడు జిల్లా పిడుగురాళ్ల సమీపంలోని బ్రాహ్మణపల్లిలో జరిగింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం తనకు బాగా జలుబు చేసిందని బాలిక ఆ ఉపాధ్యాయుడికి చెప్పగా తన వద్ద జలుబు ఇంజక్షన్లు ఉన్నాయని మాయమాటలు చెప్పి కారులో అదే గ్రామంలోని తన ఇంటికి తీసుకువెళ్లి మత్తు ఇంజక్షన్లు ఇచ్చి వివస్త్రను చేసి అత్యాచారం చేసినట్టు బాధితురాలు తెలిపింది.

గత కొన్ని రోజులుగా ఈ సంఘటన జరిగిన నేపథ్యంలో బాధితురాలికి మలవిసర్జన సమయంలో తీవ్ర నొప్పిగా ఉందని పెద్దలకు చెప్పడంతో అనారోగ్య సమస్యలు ఏమైనా తలెత్తాయేమోనని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ వైద్యులు బాధితురాలని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లాలని సూచించడంతో పెద్ద ఆసుపత్రికి తీసుకువచ్చారు. అయితే బాధితురాలి ఆరోగ్య సమస్యను పరిశీలించిన వైద్యులు బాలికపై అత్యాచారం జరిగినట్లు గ్రహించారు.

ఈ సంఘటనలో అదే పాఠశాలలో విద్యనభ్యసించే మరో బాలుడు కూడా ఉన్నాడని ఆ బాలుడు ఉపాధ్యాయునికే సహకరించినట్లు బాధిత బాలిక ఆరోపించింది. తనపై జరిగిన అత్యాచార విషయాన్ని వేరే ఎవరికైనా చెప్తే చంపేస్తానని ఆ ఉపాధ్యాయుడు తనను బెదిరించినట్లు బాధితురాలు చెప్పడం విశేషం. ఈ విషయంపై ఇప్పటికే విద్యాశాఖ అధికారుల దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలకి ఏ విధమైన న్యాయం జరుగుతుందో వేచి చూడాలి.

Related posts

11.18 శాతం పెరిగిన పన్ను వసూళ్లు

Bhavani

క్షేత్ర స్థాయిలో సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలి

Satyam NEWS

కృత్రిమ మేధస్సు, సైబర్ ఫీజికల్  సిస్టమ్స్ దే భవిష్యత్తు

Satyam NEWS

Leave a Comment