నెల్లూరు ఎంపీ, రూరల్ నియోజకవర్గ ఇంచార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డికి సోమవారం సాయంత్రం ఆయన నివాసంలో ముస్లిం నేతలు ఘన సన్మానం చేశారు. బారాషాహీద్ దర్గా కమిటీ చక్కగా పనిచేసే రొట్టెల పండుగను ఘన విజయం చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంతో పాటు ముస్లిం స్వర్ణకారుల సంఘం చైర్మన్ గా ఎన్నికైన ఇస్మాయిల్ ఖాదిరి, బారాషాహిద్ దర్గా కమిటీ చైర్మన్ గాను వ్యవహరించారు. ఈ రెండు సందర్భాలను పురస్కరించుకొని ఇస్మాయిల్ ఖాద్రి, ఎంపీ ఆదాలకు నవాబు టోపీని ముత్యాల దండను ధరింప చేశారు. శాలువాతో సత్కరించారు. డిసిసిబి మాజీ చైర్మన్ అనం విజయ్ కుమార్ రెడ్డిని కూడా సత్కరించారు. ఈ కార్యక్రమంలో విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి, వక్ఫ్ బోర్డు చైర్మన్ మీరా కూడా వచ్చి కలిశారు. కార్పొరేటర్ మోబినా, వైసీపీ నేతలు రియాజ్, సమీర్, అలి, కరీముల్లా, నాయబ్ రసూల్, జాకీర్, కాలేషా, మైపాడు అల్లా బక్షు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
previous post