ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని,వర్క్స్ బోర్డ్ కి జ్యూడిష్నల్ క స్టడీ పవర్ కల్పించాలని, రాష్ట్రవ్యాప్తంగా ముస్లిం మైనార్టీలం 12 మంది ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని,మైనార్టీ గురుకుల రెసిడెన్షియల్ స్కూల్స్ కి పక్క బిల్డింగ్ లు నిర్మించాలని,అర్హులైన ముస్లిం మైనార్టీలకు తెల్ల రేషన్ కార్డు దారులందరికి 100 శాతం సబ్సిడీతో లోన్స్ ఇవ్వాలని,వివిధ స్థాయిలో ఖాళీగా ఉన్న ఉద్యోగ టీచర్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ కి టి పి సి సి రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఎం డి.అజీజ్ పాషా లేఖ రాశారు.
ఆదివారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో టి .పి.సి.సి రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ ఎండి. అజీజ్ పాషా మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ 2014 నుండి అధికారంలోకి రావడం కోసం ముస్లిం మైనార్టీలకు అనేక వాగ్దానాలను మేనిఫెస్టోలో పెట్టి నేటి వరకు ఒక్క వాగ్దానాన్ని కూడా అమలు చేయకుండా ఇప్పుడు ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ముస్లిం మైనార్టీలను మభ్య పెట్టడం కోసం అర కొర లోన్లతో కుట్టు మిషన్లని మళ్లీ ఏర వేస్తున్నారని అన్నారు.
గత తొమ్మిది సంవత్సరాల నుండి ముస్లిం మైనార్టీలకు ఇచ్చిన అనేక వాగ్దానాలు 12 శాతం రిజర్వేషన్లు,వర్క్స్ బోర్డ్ కి జ్యూడిషనల్ కస్టడీ పవర్స్ కల్పించటం,రాష్ట్రవ్యాప్తంగా 12 మంది ముస్లిం మైనార్టీలకు అసెంబ్లీ టికెట్లు ఇవ్వడం,ముస్లిం మైనార్టీ గురుకుల రెసిడెన్షియల్ స్కూల్స్ కి పక్కాభవనాలు నిర్మించడం,అర్హులైన ముస్లిం మైనార్టీ తెల్ల రేషన్ కార్డు దారులందరికీ 100 శాతం సబ్సిడీతో లోన్లు మంజూరు ఇవ్వటం, ఖాళీగా ఉన్న ఉర్దూ పోస్టులు భర్తీ చేయడం, గురుకులాలతో పాటు వివిధ స్థాయిలలో ఉద్యోగ,టీచర్ పోస్టులను భర్తీ ఇంతవరకు నెరవేర్చలేదని అజీజ్ పాషా ముఖ్యమంత్రి కి లేఖ వ్రాస్తూ తక్షణమే ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయాలని కోరారు.
సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్