తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటి ఆరోగ్య సర్వే కోసం మైహోం పరిశ్రమ యాజమాన్యం చేయూతనిచ్చేందుకు ముందుకు వచ్చింది. సామాజిక బాధ్యతలో భాగంగా సుమారు రెండు లక్షల రూపాయల విలువ చేసే జ్వరమానిలను, ఆక్సీ మీటర్ లను సూర్యాపేట కలెక్టర్ వినయ్ కృష్ణరెడ్డి కి మైహోం ప్రతినిధులు అందజేశారు.
ఈ సందర్భముగా పరిశ్రమ హెడ్ ఎన్.శ్రీనివాస రావు మాట్లాడుతూ కరోనా రోజు రోజుకు రూపాంతరం చెందుతున్న ఈ సంక్షోభ సమయంలో తెలంగాణా ప్రభుత్వం నిర్దేశించిన విధంగా ప్రాధమిక నియమావళిని మనమంతా తప్పకుండా పాటించాలని కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్ ,ఆర్. డి. ఓ. సహాయం అందించడానికి ముందుకు వచ్చిన మైహోం పరిశ్రమ యాజమాన్యాన్ని అభినందించారు. ఈ కార్యక్రమములో హెచ్.ఆర్. హెడ్ P.పార్థసారథి, మైన్స్ హెడ్ K.శ్రీనివాస రావు తదితరులు పాల్గోన్నారు.