మై వేములవాడ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో పోలీసు సిబ్బందికి కరోనా కిట్ పంపిణీ చేశారు.
రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవాడలో కరోనా విధులు నిర్వహిస్తున్న పోలీసులకు రక్షణ కల్పించేందుకు మై వేములవాడ చారిటబుల్ ట్రస్టు ముందుకు వచ్చింది.
N95 మాస్కులు, సర్జికల్ మాస్కులు, శానిటైజర్లు ఎనర్జీ డ్రింక్స్ ను నేడు సర్కిల్ ఇన్ స్పెక్టర్ వెంకటేష్ చేతుల మీదుగా పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు కుమ్మరి శంకర్, మదు మహేష్, తాటికొండ పవన్ కుమార్, గొంగళ్ల రవికుమార్, డాక్టర్ రవీందర్, రంగుల శ్రీనివాస్, నాగుల చంద్రశేఖర్ పాల్గొన్నారు.