నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ క్రైమ్ కౌన్సిల్ సూర్యాపేట జిల్లా బృందం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ఏరియా వైద్యశాలలో కోవిడ్ రోగులకు,వైద్యశాల సిబ్బందికి పండ్లు పంపిణీ చేశారు.
రక్షణ కల్పించే రక్షక భటులకు కోవిడ్ లాక్ డౌన్ సమయంలో 24 గంటలు ప్రజల కోసం నిరంతరం సేవ చేస్తున పోలీస్ అధికారులకు వాటర్ బాటిల్స్,బిస్కెట్స్, పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ క్రైమ్ కౌన్సిల్ బృందం సభ్యులు మాట్లాడుతూ కరోనా సెకండ్ వెవ్ విస్తరిస్తున క్రమంలో ప్రజలు అంతా మాస్క్ లు ధరించి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని, ఎవరికి అయిన కరోనా లక్షణాలు ఉంటే టెస్ట్ లు చేపించుకొని కరోనా వ్యాప్తి కాకుండా చేసి దూరంగా ఉండాలని, ప్రజలంతా వాక్సిన్ తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ క్రైమ్ కౌన్సిల్ జిల్లా జనరల్ సెక్రటరీ షేక్.హుస్సేన్,జిల్లా సెక్రెటరీ గాదె శ్రీకాంత్, ఎడ్యుకేషనల్ సెల్ చైర్మన్ ఉమ్మన బోయిన పవన్ కుమార్,యస్.సి సెల్ చైర్మన్ పాముల శ్రీకాంత్,మైనారిటీ సెల్ చైర్మన్ షేక్ షరీఫ్,బి.సి సెల్ వైస్ చైర్మన్ చింతల వెంకట నారాయణ,యస్.సి సెల్ వైస్ చైర్మన్ పురుషోత్తం,ఆర్టీఏ సెల్ వైస్ చైర్మన్ చిట్టిప్రొలు ఉపేందర్,యస్.సి సెల్ సెక్రెటరీ యాలమర్తి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.