ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయ ఉపకులపతిగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఆచార్య కె.పద్మరాజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్, విశ్వవిద్యాలయాల కులపతి ఎస్.అబ్దుల్ నజీర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. గవర్నర్ కార్యాలయంలో గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ కు పుష్పగుచ్చం అందించి నన్నయ విశ్వవిద్యాలయ ఉపకులపతిగా నియమించినందుకు
కృతజ్ఞతలు తెలిపారు. ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయ అభివృద్ధికి కృషి చేస్తానని, విశ్వవిద్యాలయ అభివృద్ధి ప్రణాళికను గవర్నర్ కు వివరించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన వీసీ ఆచార్య కె.పద్మరాజుకు గవర్నర్ అబ్దుల్ నజీర్ శుభాకాంక్షలను తెలియజేసారు.