చిత్తూరు జిల్లా నగరి రూరల్ మండలం తడుకు పేటకు చెందిన చెన్నై హైకోర్టు ఉద్యోగి మునిరత్నం కుమార్తె శ్రీమతి కాళహస్తి కల్పన భారతదేశ కీర్తి ప్రతిష్టలను చంద్రయాన్-3 ద్వారా ఇనుమడింప జేసారు.కాళహస్తి కల్పన చంద్రయాన్ ప్రాజెక్ట్ అసోసియేట్ డైరెక్టర్ కావడం భారతీయులు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు గర్వించదగ్గ విషయమని నగరి నియోజకవర్గ ప్రజలందరు కల్పన కి ప్రత్యేక అభినందనలు తెలియ జేశారు.