నమస్తే తెలంగాణ తుఫ్రాన్ రూరల్ రిపోర్టర్ సీహెచ్ నాగరాజు ఆత్మహత్య చేసుకున్నాడు. నిన్న రాత్రి చెరువులో దూకి ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈరోజు ఉదయం విషయం వెలుగులోకి వచ్చింది. తన మెడలో నమస్తే తెలంగాణ దినపత్రిక అక్రిడిటేషన్ కార్డును వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్టు స్థానికులు తెలిపారు.
ఈ ఆత్మహత్య వార్త కలకలం రేపుతున్నది. ఏడాది క్రితం నాగరాజు తన ఇబ్బందికర పరిస్థితులను వివరిస్తూ మంత్రి హరీశ్రావుకు లేఖ రాశాడు.
అందులో తాను శానిటైజర్ తాగి ఆత్మహత్యచేసుకుంటున్నట్లు వెల్లడించడంతో ఈ లేఖ కలకలం రేపింది. అప్పటికే నాగరాజును ఆస్పత్రికి తీసుకుపోవడంతో చావుతప్పి బయటపడ్డాడు.
ఏడాది తర్వాత ఇప్పుడు ఇలా నాగరాజు బలవన్మరణం పొందాడు.