శ్రీకాకుళం జిల్లా సమగ్ర శిక్షా ఒప్పంద, పొరుగు సేవలు, తాత్కాలిక ఉద్యోగస్తుల నూతన సంవత్సర 2020 క్యాలెండర్ ను నేడు మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు విడుదల చేశారు. క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో క్యాలండర్ ను విడుదల చేసి ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం సమగ్ర శిక్షా లో పనిచేస్తున్న అన్ని కేటగిరీలో ఉన్న ఉద్యోగస్థులను శాశ్వత ఉద్యోగస్థులుగా మార్చడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
అందుకోసం వివరాలను తీసుకున్నామని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్షా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులైన గంగు వెంకట రమణ మూర్తి, గుండబాల మోహన్ సంఘ ముఖ్య సభ్యులైన లోపింటి దిలీప్, రామారావు, నరేష్, పద్మావతి, త్రివేణి, సుజవాని, శశికళ, రాజేశ్వరి, లత, ప్రసాదరావు, అప్పలరాజు, అప్పారావు, కామేష్, మోహనరావు తదితరులు పాల్గొన్నారు.