కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ లాక్ డౌన్ ప్రకటించినందున పేద ప్రజలు ఇబ్బంది పడకుండా కేంద్ర ప్రభుత్వం గరీబ్ కళ్యాణ్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది.
ఈ పథకం ద్వారా 1.70 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించి పేదలకు ఆపన్న హస్తం అందించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలుపుతూ ఇంటి ముందు రెండు జ్యోతులు వెలిగించి దేశవ్యాప్తంగా ధన్యవాదాలు తెలిపారు.
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా పిలుపు మేరకు కేంద్రంలో తెలంగాణ బిజెపి కో ఆర్డినేటర్ నూనె బాల్ రాజ్ తన ఇంటిలో దీపాలు వెలిగించి ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షులు బండి సంజయ్ పిలుపు మేరకు నమో జ్యోతి కార్యక్రమంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలుపుతూ కొత్తూరు మండల M P T C బిజెపి మండల ఉపాధ్యక్షులు ఎర్రవెల్లి ప్రసన్న నాగరాజు వారి కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు.