నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ NTSE లెవెల్ 2 లో నారాయణ ఒలంపియాడ్ పాఠశాల విద్యార్థిని విజయ ఢంకా మోగించింది. మదీనాగూడ నారాయణ ఒలంపియాడ్ పాఠశాలలో చదువుతున్న యనమల షామిలి ఈ ఘనత సాధించింది. నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ NTSE లెవెల్ 2 లో ఉత్తీర్ణురాలై స్కాలర్షిప్ కు అర్హత సాధించింది. ఈ సందర్భంగా రాష్ట్ర కోఆర్డినేటర్ శ్రీ లక్ష్మీ, ప్రధానోపాధ్యాయులు రాధికా, డీజీఎం గోపాల్ రెడ్డి, ఏజీఎం వేణుగోపాల్ చిన్నారి షామిలి కి అభినందనలు తెలిపారు. యనమల షామిలి భవిష్యత్తులో ఎన్నో విజయాలు సాధించాలని వారు ఆశీర్వదించారు.
previous post