30.3 C
Hyderabad
March 15, 2025 10: 00 AM
Slider నిజామాబాద్

బిచ్కుందలో తైబజార్ వేలం పాటకు తగ్గిన ధర

#Bichkunda Taibazar

బిచ్కుంద మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ప్రాంగణంలో తైబజార్ వేలం పాట శనివారం జరిగింది.ఈ వేలంపాట గత రెండు సార్లు వాయిదా పడుతూ వచ్చింది. శనివారం మూడోసారి వేలం పాట పోటాపోటీగా జరగగా  బిచ్కుంద మండల కేంద్రానికి చెందిన మహమూద్ 8 లక్షల 55లక్షల రూపాయలకు వేలంపాటను చేజిక్కించుకున్నారు.

గత సంవత్సరం జరిగిన వేలం పాట 9 లక్షలు 67వేల రూపాయలు దక్కించుకోగా ఈ ఏడు లక్ష  పైచిలుకు  తగ్గింది. లాక్డౌన్ కారణంగా రెండు నెలలు నష్టపోవల్సి వచ్చిందని అందుకు ఎవరూ కూడా సాహసం చేయకపోవడంతో లక్ష రూపాయ తగ్గినట్లు పలువురు అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారు.

ఈ వేలంపాట కార్యక్రమంలో ముందస్తు సమాచారం మేరకు పంచాయతీ కార్యదర్శి రజనీకాంత్ రెడ్డి ఆదేశాల మేరకు  వేలంపాట దక్కించుకున్న వారు ఆ సొమ్ములో సగం సొమ్మును గ్రామ పంచాయతీకి  చెల్లించి గ్రామ పంచాయతీ ఆదేశాల మేరకు ధరల ప్రకారం మాత్రమే వ్యాపారుల వద్ద రుసుములు వసూలు చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శితో పాటు సర్పంచ్ శ్రీరేఖ రాజు ఉపసర్పంచ్ నాగరాజు వేలంపాటదారులు పంచాయతీ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Related posts

ఒకే కుటుంబంలో ముగ్గురి దారుణ హత్య

Satyam NEWS

‘కోటా’ ఐఐటీ, మెడికల్ ఫౌండేషన్ మెటీరియల్ సిద్ధం

Satyam NEWS

ప‌ట్టుకున్న విలువ త‌క్కువే..కానీ సినీ ఫ‌క్కీలో కేస్ ను ట్రేస్ చేసిన ఎస్ఐలు…!

Satyam NEWS

Leave a Comment