బిచ్కుంద మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ప్రాంగణంలో తైబజార్ వేలం పాట శనివారం జరిగింది.ఈ వేలంపాట గత రెండు సార్లు వాయిదా పడుతూ వచ్చింది. శనివారం మూడోసారి వేలం పాట పోటాపోటీగా జరగగా బిచ్కుంద మండల కేంద్రానికి చెందిన మహమూద్ 8 లక్షల 55లక్షల రూపాయలకు వేలంపాటను చేజిక్కించుకున్నారు.
గత సంవత్సరం జరిగిన వేలం పాట 9 లక్షలు 67వేల రూపాయలు దక్కించుకోగా ఈ ఏడు లక్ష పైచిలుకు తగ్గింది. లాక్డౌన్ కారణంగా రెండు నెలలు నష్టపోవల్సి వచ్చిందని అందుకు ఎవరూ కూడా సాహసం చేయకపోవడంతో లక్ష రూపాయ తగ్గినట్లు పలువురు అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారు.
ఈ వేలంపాట కార్యక్రమంలో ముందస్తు సమాచారం మేరకు పంచాయతీ కార్యదర్శి రజనీకాంత్ రెడ్డి ఆదేశాల మేరకు వేలంపాట దక్కించుకున్న వారు ఆ సొమ్ములో సగం సొమ్మును గ్రామ పంచాయతీకి చెల్లించి గ్రామ పంచాయతీ ఆదేశాల మేరకు ధరల ప్రకారం మాత్రమే వ్యాపారుల వద్ద రుసుములు వసూలు చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శితో పాటు సర్పంచ్ శ్రీరేఖ రాజు ఉపసర్పంచ్ నాగరాజు వేలంపాటదారులు పంచాయతీ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.