40.2 C
Hyderabad
May 2, 2024 16: 14 PM
Slider ఖమ్మం

ఘనంగా జాతీయ ఐక్యతా దినోత్సవo

#khammampolice

వల్లభాయ్ పటేల్ 147వ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 31న నిర్వహించే జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని (రాష్ట్రీయ ఏక్తా దివస్) ఖమ్మం  పోలీసు శాఖ ఆధ్వర్యంలో సిటి ఆర్ముడ్ పోలీసు హెడ్ క్వార్టర్స్ పరేడ్ మైదానంలో ఘనంగా  నిర్వహించారు. కార్యక్రమానికి హజరైన అడిషనల్ డీసీపీ శభరిష్ భారతదేశ సమగ్రత కోసం పాటు పడిన సర్దార్ వల్లభాయి  పటేల్ యొక్క సేవలకు స్పూర్తిగా ప్రజల భద్రతకు, శాంతిభద్రతల పరిరక్షణకు ఆహర్నిశలు తమవంతు కృషి చేస్తామని జిల్లా పోలీసు సిబ్బందితో కలసి ప్రతిజ్ఞ చేశారు. ఆనంతరం అడిషనల్ డీసీపీ మాట్లాడుతూ  సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా దేశం ఆయనను స్మరించుకుంటుందని, భారతీయ ఉక్కుమనిషిగా పిలువబడే సర్దార్ వల్లభాయి పటేల్,  దేశసమగ్రభారతావనిని  అందించారని అన్నారు. వల్లభాయ్ పటేల్ దృఢ‌మైన స్ఫూర్తితో దేశం యొక్క ఐక్యత, సమగ్రత, భద్రతను  కాపాడటం బాధ్యతగా తీసుకొవాలని  సూచించారు. కార్యక్రమంలో  ఎఆర్ అడిషనల్ డి‌సి‌పి కుమారస్వామి, ఏసీపీ  ప్రసన్న కుమార్, ఆర్ఐ లు రవి, శ్రీశైలం, సాంబశివరావు పాల్గొన్నారు.

Related posts

మద్యంతో ఓటర్లను ఆకట్టుకుంటున్న మంత్రి మల్లారెడ్డి

Satyam NEWS

భద్రాచలం వద్ద గోదావరి క భారీ వరద… మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

Bhavani

ఎయిమ్స్‌ నుంచి మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ డిశ్చార్జ్‌

Sub Editor

Leave a Comment