మునుగోడు నియోజకవర్గం లో ఓటర్లను మచ్చిక చేసుకోడానికి మంత్రి మల్లారెడ్డి మందు పార్టీ ఇచ్చిన అంశం ఇప్పుడు పెద్ద దుమారం రేపుతున్నది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం లోని ఆరెగూడెం, రెడ్డి బావి, గుండ్ల బావి గ్రామాలకు తెరాస తరపున ఆయన ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. గ్రామంలోని వృద్ధుల ఓట్లు రాబట్టడానికి స్వయంగా మద్యంతో రంగంలోకి మంత్రి దిగడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది.
previous post