గెరిల్లా యుద్ధం అంటో యావత్ ప్రపంచానికి తెలియచెప్పిన వీరుడు… తల్లి మాటే లక్ష్యంగా చేసుకున్న ధీశాలి…గురువు వాక్కే ప్రేరణగా ఆచరించిన ధీరుడు.. అతనే ఛత్రపతి శివాజీ మహారాజ్.శివాజీ మహారాజ్ హయాంలో హిందూ
ప్రజలంతా సుఖంగా దాడులు లేకుండా.. సమైక్యంగా జీవించారు.అలాంటి మహావీరుడు…పట్టాభిషిక్తుడైన రోజు జూన్ 02. ఈ మేరకు యావత్ హిందూ సమాజం… “హిందూ సామ్రాజ్య దినోత్సవం” జరుపుకోవలసిన రోజు…. ఈ రోజు. ఓ హిందువా
మేలుకో…” అంటూ వ్యక్తి నిర్మాణం అయితే తద్వారా కుటుంబం, సమాజం ధృడత్వంగా ఉంటుందని… వేల కాలం సంస్కృతి ని…కేవలం ఒకే ఒక్క “శాఖ” ద్వారా తెలియజెప్పుతున్న “రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ” ప్రతీ ఏటా
నిర్వహిస్తున్న దినోత్సవాలలో పైన చెప్పినదొకటి.ఈ క్రమంలోదేశ వ్యాప్తంగా ఆర్.ఎస్.ఎస్ నిర్వహిస్తున్న అన్ని శాఖలలో “హిందూ సామ్రాజ్య దినోత్సవం” జరిగింది. అందులో భాగంగా విజయనగరం లో ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర బ్యాంక్ కాలనిలో
ప్రతీ రోజు జరుగుతున్న ఆర్.ఎస్.ఎస్ శాఖలో..”హిందూ సామ్రాజ్య దినోత్సవం” జరిగింది. సంఘ్ ఇచ్చిన పిలుపు మేరకు నిత్య శాఖలో ఆ దినోత్సవం నిర్వహించాలని చెప్పడంతో శాఖ ముఖ్య శిక్షక్…దేశరాజు అప్పరావు…ఆధ్వర్యంలో “హిందూ
సామ్రాజ్య దినోత్సవం” జరిగింది. ఈ మేరకు సంఘ్ విభాగ్ బౌధ్ధిక్ ప్రముఖ్ తిరుపతి రావు…ఛత్రపతి శివాజీ.. గురించి తెలియజేసారు. ఈ కార్యక్రమమునకు బాలాజీ నగర శ్రీ వేంకటేశ్వర దేవాలయ ట్రస్ట్ సభ్యులు భగవాన్, సింగ్ తదితరులు పాల్గొన్నారు.