26.7 C
Hyderabad
April 27, 2024 08: 18 AM
Slider సినిమా

హీరో వరుణ్ తేజ్ కు కోర్టు నోటీసులు

varuntej

‘వాల్మీకి’ సినిమా వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాకు హరీశ్ శంకర్ దర్శకత్వం వహించగా, వరుణ్ తేజ్ హీరోగా నటించారు. సినిమాకు ‘వాల్మీకి’ టైటిల్ ను మార్చాలని కోరుతూ బోయ హక్కుల పోరాట సమితి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసింది. ‘వాల్మీకి’ టైటిల్ బోయల మనో భావాలకు భంగం కలిగించేవిధంగా ఉందని బోయ నేతలు చెబుతున్నారు.ఈ పిటిషన్ పై కోర్టు విచారణ చేపట్టింది. హీరో వరుణ్ తేజ్ , సినిమా యూనిట్, తెలంగాణ డిజిపి, సెన్సార్ బోర్డు, ఫిలించాంబర్ కు కోర్టు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో ఈ వివాదంపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను మాసం రోజులకు వాయిదా వేసింది. ‘వాల్మీకి’ సినిమాను సెప్టెంబర్ 20 ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు నిర్మాతలు ఏర్పాట్లు చేసుకున్నారు.

Related posts

ఓరుగంటి రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు గురించి సీఎం కు చెప్పండి

Satyam NEWS

Confusion Congress : రంగంలో దిగుతున్న కొత్త ముఖాలు

Satyam NEWS

ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్ చేయాలి: టీడీపీ డిమాండ్

Satyam NEWS

Leave a Comment