జోగులంబ గద్వాల జిల్లాలోని 44 నెంబర్ జాతీయ రహదారి ప్రక్కన గల బీచుపల్లి శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో హనుమద్ వ్రతం సందర్భంగా హనుమాన్ రక్షణ కంకణంకు నది స్నానాలతో శాస్త్రోక్తంగా స్వామివారికి పూజలు నిర్వహించారు. తదనంతరం స్వామి వారి రక్షణ కంకణం భక్తులకు ఇచ్చారు. ఇంకా అన్నదానం నిర్వహించారు. ఆంజనేయ స్వాముల 41 దినముల మాల విరమణ ఇరుముడులు స్వామివారికి సమర్పించారు. ఆలయ ప్రధానార్చకులు ప్రహ్లాద చారి, మారుతి చారి, ఉమ్మడి జిల్లా అర్చకుల సంఘం అధ్యక్షుడు సందీప్ ఆచారి, మద్వ ఆచారి, ఈవో రామన్ గౌడ్, వాల్మీకి పూజారులు, ఆలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.