38.2 C
Hyderabad
April 28, 2024 22: 00 PM
Slider ముఖ్యంశాలు

నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్

#Biswabhushan Harichandan

ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వ భూషణ్ హరిచందన్ రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసారు. కొత్త సంవత్సరం తెలుగు ప్రజలు అందరికీ సంతోషాన్ని, శాంతిని అందించాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. గవర్నర్ మాట్లాడుతూ నూతన సంవత్సరం ఉజ్వల భవిష్యత్తు కోసం వేచి చూడటానికి,  కొత్త అవకాశాలను అన్వేషించడానికి, నూతన లక్ష్యాలను సాధించడానికి స్ఫూర్తిని ఇస్తుందన్నారు. ఓమ్రికాన్ వేరియంట్ ఆవిర్భావంతో కరోనా ముప్పు మరింత పెరిగిందని, అన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా కుటుంబ సభ్యులతో కలిసి తమ నివాసాలలోనే నూతన సంవత్సర వేడుకలను జరుపుకోవాలని గవర్నర్ పిలుపు నిచ్చారు. మరోవైపు ప్రస్తుత కరోనా పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని సాధారణ ప్రజానీకం, ప్రముఖులు రాజ్‌భవన్‌లో గౌరవ గవర్నర్‌ను మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపే సంప్రదాయ విధానాన్ని ఈ సంవత్సరం కూడా నిర్వహించడం లేదని గవర్నర్ వారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా ప్రకటించారు.

Related posts

శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు!

Satyam NEWS

ప్రతి ఒక్కరు ఓటుహక్కు వినియోగించుకోవాలి

Bhavani

వ‌సంత మండ‌పంలో శాస్త్రోక్తంగా గోపాష్ట‌మి‌

Satyam NEWS

Leave a Comment