ముస్లింలకు నవతరం పార్టీ రంజాన్ శుభాకాంక్షలు ముస్లింల పవిత్ర పండుగైన రంజాన్ పండుగను పురస్కరించుకుని ముస్లిం సోదరులకు నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం సోదరులు పవిత్ర రంజాన్ ఉపవాసాన్ని నిష్టతో కఠినంగా ఉపవాస దీక్షలను పాటించారని అన్నారు. క్రమ శిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయిక రంజాన్ పండుగ అన్నారు. పవిత్రతకు, త్యాగానికి, మత సామరస్యం, సోదర భావం చాటి చెప్పే పండుగను ముస్లిం సోదరులు భక్తి శ్రద్దలతో, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని, అల్లా దయతో అందరి జీవితాల్లో ఆనంద వెల్లివిరియాలని రావుసుబ్రహ్మణ్యం ఆకాక్షించారు.
previous post
next post