భారత దేశానికి తొలి ప్రధానిగా 17 సంవత్సరాల పాటు పనిచేసిన పండిత్ జవహర్ లాల్ నెహ్రూ ముందు చూపుతో అనసరించిన విధానాలు సర్వదా అనుసరణీయమని రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘ గౌరవాధ్యక్షుడు M.సత్యసాగర్ అన్నారు. నవంబర్ 14న చాచా నెహ్రూ 133వ పుట్టిన రోజు పురస్కరించకొని తెనాలిలోని కొత్తపేట లో పెన్షనర్ల
కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ ఆయన లౌకిక సామ్యవాదని ఆయన అవలంభించిన “పంచశీల” “అలీన విధానం” ప్రపంచ దేశాలలో దేశ ప్రతిష్ట ఇనుమడింప చేసిందని, అలాగే ఆహార థాన్యాల ఉత్పత్తి ని శాస్త్రవేత్త స్వామినాథన్ తో హరిత విప్లవం (Green Revolution), కురియన్ సాకారంతో ఆనంద్ “పాల వెల్లవ” (White Revolution) భారత దేశానికి సము పార్జించాడని పరిశ్రమల స్థాపన చేసి ఆధునిక దేవాలయాలుగా వాటిని తీర్చి దిద్దినఘనుడని కీర్తించారు. ఈ కార్యక్రమంలో అథ్యక్షులు రామకృష్ణమూర్తి ,అజగర్ అలి, సోమయ్య శాస్త్రి తదితరులు ప్రసంగించారు.