విశాఖ ఉక్కు ఉద్యమానికి మావోయిస్టులు సంపూర్ణ మద్దతు పలికారు. 32 మంది అమరుల త్యాగానికి నివాళిగా విశాఖ ఉక్కును కాపాడుకోవాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు.
ఈ మేరకు మావోయిస్ట్ ఏఓబి జోనల్ కమిటీ కార్యదర్శి కైలాసం పేరుతో లేఖ విడుదల అయింది.
ఉక్కు పరిశ్రమని అందరం ఐక్యంగా ఉద్యమించి కాపాడుకుంటేనే భవిష్యత్తు ఉంటుందని వారు అభిప్రాయపడ్డారు.
పార్టీలపరంగా వేరైనప్పటికి బిజెపి, వైసీపీ అమలు చేసే విధానాలు మాత్రం ఒక్కటేనని వారు అభిప్రాయపడ్డారు.