29.7 C
Hyderabad
May 4, 2024 05: 22 AM
Slider నెల్లూరు

లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఎంపీ ఆదాల స్వాగతం

#adalaprabhakarreddy

నెల్లూరు జిల్లా వెంకటాచలంలోని స్వర్ణ భారత్ ట్రస్ట్ లో సోమవారం దసరా వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో కలిసి నెల్లూరు ఎంపీ ఆదాల  ప్రభాకర్ రెడ్డి స్వాగతించారు. శాలువాను కప్పి, పుష్పగుచ్చంతో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, ఎస్పీ విజయరావు, బిజెపి నేతలు సుజన చౌదరి, కామినేని శ్రీనివాసరావు, సురేంద్ర రెడ్డి, ఆంజనేయ రెడ్డి, విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి, జడ్పిటిసి సుధాకర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ స్వర్ణ వెంకయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఢిల్లీ పయనం అయ్యారు. నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు సోమవారం సాయంత్రం పోలీసు మైదానంలో వీడ్కోలు సత్కారం చేశారు. శాలువా కప్పి ఆత్మీయ వచనాలు పలికారు.  

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యకు ఘన సన్మానం

నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి ఘన సన్మానం చేశారు. వెంకయ్య నాయుడుకు ఎంపీ వేమిరెడ్డి ఆధ్వర్యంలో ఆత్మీయ అభినందన ఉత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తోపాటు ఎంపీలు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, బిజెపి నేతలు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. వేడుకగా జరిగిన కార్యక్రమంలో నెల్లూరు ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు.

Related posts

పొత్తులపై గందరగోళానికి తెరదించండి

Bhavani

ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఘనంగా గురుపర్వ్ ఉత్సవాలు

Satyam NEWS

పీఆర్‌‌టీయూ ఆధ్వర్యంలో భోజనం ప్యాకెట్లు పంపిణీ

Satyam NEWS

Leave a Comment