నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల పీఆర్టీయూ ఆధ్వర్యంలో మండలంలో లాక్ డౌన్ సందర్భంగాడ్యూటీ చేస్తున్న పోలీసు,రెవెన్యూ,హెల్త్ సిబ్బందికి,నిరుపేదలకు 120 భోజనం ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఆయా శాఖల అధికారులకు, ఎమ్మార్సీ సిబ్బందికి మీడియా రిపోర్టర్లకు 50 మందికి శానిటైజర్లు,మాస్కులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన పీఆర్టీయూ మండల అధ్యక్షులు శానం సాయిలు ఈ కార్యక్రమం విజయవంతం అవ్వడానికి సహకరించిన దాతలకు,పీయస్ఆర్ యువసేన సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో నాగనాథ్, జిల్లా కార్యదర్శి ఉదయ్ చందర్,రాష్ట్ర బాధ్యులు మామిడి హన్మాండ్లు, బర్ల సాయిలు, మండల కార్యదర్శి కృష్ణ మోహన్ తదితరులు పాల్గొన్నారు.