అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ సొమ్ము అందేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు.హైదరాబాద్ నుండి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారుల తో కలిసి వివిధ ప్రభుత్వ కార్యక్రమం లపై సమీక్ష చేశారు.
వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి రైతు రుణమాఫీ, ఆసరా ఫించన్,కారుణ్య నియామకాలు, ఇంటి పట్టాల పంపిణీ, గృహలక్ష్మి , జీఓ 59 వంటి పలు అంశాలపై మంత్రి తన్నీరు హరీష్ రావు జిల్లా కలెక్టర్ లకు పలు సూచనలు చేశారు.