28.7 C
Hyderabad
May 5, 2024 09: 14 AM
Slider నల్గొండ

వైఎస్ రాజన్న పాలన కోసం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో చేరికలు

#ysrtp

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ మఠంపల్లి మండలం నుండి ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు నరేందర్ నాయక్, భీమ్లాతండా గ్రామశాఖ అధ్యక్షుడు మాలోతు నరసింహ నాయక్ ఆధ్వర్యంలో కృష్ణ తండా,భీమ్లా తండా గ్రామాల నుండి టిఆర్ఎస్,కాంగ్రెస్ పార్టీలకు చెందిన కార్యకర్తలు పలువురు బుధవారం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ హుజూర్ నగర్ నియోజకవర్గ కో-ఆర్డినేటర్ ఆదెర్ల శ్రీనివాస రెడ్డి సమక్షంలో వైయస్సార్ తెలంగాణ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా ఆదెర్ల శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పనితీరు కేవలం కల్లబొల్లి మాటలకే పరిమితం అయిందని, నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి పరిపాలన మళ్ళీ చూడాలని వైఎస్ షర్మిల ఏర్పాటుచేసిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో చేరుతున్నట్లు వారు తెలిపారు.

సంక్షేమం,సమానత్వం,స్వయం సమృద్ధి సాధించిన రోజే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని,ఇవన్నీ సాధించేందుకే  వైయస్ షర్మిల సారధ్యంలో వైయస్సార్ తెలంగాణ పార్టీలో చేరాలని శ్రీనివాస రెడ్డి పిలుపునిచ్చారు. భూక్యా మంగ్యా నాయక్,అజమేరా పరమేష్,బానోతు హనుమా,బానోతు రమేష్,అజమేరా గోపి,పానుగోతు గోపి, పానుగోతు శంకర్,పానుగోతు హనుమా,గుగులోతు గోపి,గుగులోతు బద్దు పలువురికి శ్రీనివాస రెడ్డి వైఎస్ఆర్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

పీఠాధిపతులను కలిసిన ఆంధ్ర వనవాస కళ్యాణాశ్రమ ప్రతినిధులు

Satyam NEWS

ప్రధాని మోడీతో ఏపీ సీఎం జగన్ భేటీ

Satyam NEWS

రోడ్ ప్ర‌మాదల నివార‌ణ‌కు ముంద‌స్తు జాగ్ర‌త్త‌లే మార్గం….!

Satyam NEWS

Leave a Comment