ఆంధ్ర వనవాస కళ్యాణాశ్రమం ప్రతినిధులు బుధవారం విశాఖ శారదా పీఠాధిపతులను కలిశారు. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర ఆశీస్సులు అందుకున్నారు.
గిరిజన ప్రాంతాల్లో విద్యార్థులకు తమ ఆశ్రమం ద్వారా అందిస్తున్న సేవలను స్వామీజీలకు వివరించారు. గిరిజనుల ద్వారా విశాఖ శారదాపీఠం సేవా కార్యక్రమాల గురించి తెలుసుకుని స్వామిజీని కలిసేందుకు వచ్చామని తెలిపారు.
హిందూ ధర్మం పట్ల గిరిజనుల్లో చైతన్యం కల్పించేందుకు విశాఖ శారదాపీఠం చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని ప్రశంసించారు.
గిరిజనుల్లో హిందూ ధర్మం పట్ల చైతన్యం పెరుగుతోందని, సాధుసంతుల ఉపన్యాసాలను గిరిజన విద్యార్థులు వింటున్నారని ఆంధ్ర వనవాసి కళ్యాణ ఆశ్రమం ప్రతినిధులు స్వామిజీ దృష్టికి తీసుకొచ్చారు.
సంస్థ మార్గదర్శకులు పివి సోమయాజులు, ప్రతినిధులు సుభద్రాల ఉమ, మూర్తి, ఈశ్వర్, కొండబాబు తదితరులు స్వామీజీని కలిసిన వారిలో ఉన్నారు