రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఇవాళ పదవీ విరమణ చేయనున్నారు. అయితే ఆయన కోసం జగన్ సర్కారు కొత్త పోస్టు సృష్టించింది. సీఎం కార్యాలయంలో సమీర్ శర్మను ప్రభుత్వ ఎక్స్-అఫీషియో చీఫ్ సెక్రటరీ హోదాలో నియమిస్తూ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్ గానూ సమీర్ శర్మను నియమించింది.