కల్కీ, అవే లాంటి సక్సెస్ ఫుల్ చిత్రాలను డైరెక్ట్ చేసిన ప్రశాంత్ వర్మ ఇప్పుడు మరో కొత్త జోనర్ చిత్రంతో ముందుకు వస్తున్నాడు.
‘‘జాంబి రెడ్డి’’ పేరుతో వస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ ఆనందిని మరో యాంగిల్ లో పరిచయం చేసే మోషన్ పోస్టర్ ను దీపావళి పండుగ సందర్భంగా విడుదల చేశారు.
దసరా సందర్భంగా త్రిశూలం పట్టుకున్న ఆనంది పోస్టర్ కు విపరీతమైన స్పందన వచ్చింది. దీపావళి సందర్భంగా పబ్జి గర్ల్ పోస్టర్ ను విడుదల చేశారు.
తేజా సజ్జా ఈ చిత్రంలో లీడ్ రోల్ ను పోషిస్తున్నాడు. కర్నూలు బ్యాక్ డ్రాప్ లో తెలుగులో వస్తున్న తొలి జాంబీ మూవీ ఇది.
ఈ చిత్రానికి నిర్మాత రాజశేఖర్ వర్మ కాగా సంగీత దర్శకుడు మార్క్ కె రాబిన్.