ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ హైదరాబాద్లోని కార్యాలయం నుంచి విధులను నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్. రమేశ్ కుమార్ శుక్రవారం ఉదయం ఒక ప్రకటన విడుదల చేశారు. సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొన్న విధంగా ఇప్పటికే అమలులో ఉన్న పథకాలను అమలు చేసే వీలు కలిగిస్తున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకొని గృహ స్థలాల పంపిణీ కోసం తదుపరి ఏర్పాటు చేసుకునే విధంగా క్లియర్ చేశామని ఆయన తెలిపారు. వాస్తవాలను తగిన విధంగా పరిగణనలోకి తీసుకుని, కమిషన్ ఈ మేరకు ఆమోదం ఇచ్చినట్లు ఆయన తెలిపారు.
previous post