29.7 C
Hyderabad
May 7, 2024 06: 55 AM
Slider ముఖ్యంశాలు

విలేకరులపై దాడికి నిరసనగా నిర్మల్ ప్రెస్ క్లబ్ ఆందోళన

#NirmalCollector

మూడు రోజుల క్రితం బైంసా అల్లర్లలో తమ విధి నిర్వహణలో ఉన్న విలేకరులపై జరిగిన దాడిని నిరసిస్తూ కలెక్టర్ కార్యాలయం ముందు నిర్మల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.

ఈ ధర్నాకు బిజెపి మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పని చేస్తున్నా మీడియా మిత్రుల పై దాడులు చేయడం సరికాదన్నారు.

దాడిలో గాయపడ్డ రిపోర్టర్లకు ప్రభుత్వం చికిత్స అందించాలన్నారు. అదేవిధంగా ప్రభుత్వం తరఫున వారికి ఐదు లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.

రిపోర్టర్ల పై దాడులకు పాల్పడ్డ వారిని వెంటనే శిక్షించాలని, రాబోయే రోజుల్లో దాడులు జరగకుండా ఉండాలంటే చట్టాలను కఠినతరం చేయాలని పేర్కొన్నారు.

అనంతరం కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు.

Related posts

తిరుమలలో దారుణం: పారువేట మండపం కూల్చివేత

Bhavani

అత్యాచారం చేసిన ఎంఐఎం నేతను అరెస్టు చేయాలి

Satyam NEWS

2 అడుగుల స్థ‌ల వివాదంలో పోలీసు పంచాయితీ

Satyam NEWS

Leave a Comment