15 సంవత్సరాలుగా అధికారంలో ఉంటూ కూడా మళ్లీ నితిష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రి కాబోతున్నారు. 2019 లోక్ సభ ఎన్నికలలో పోగొట్టుకున్నపరువును ఆయన మళ్లీ తిరిగి తెచ్చుకున్నారు.
ముగిసిన అసెంబ్లీ ఎన్నికలలో ఎన్ డి ఏ కూటమి స్వల్ప ఆధిక్యత ఖరారు చేసుకుని అధికారం చేపట్టే దిశగా కదులుతున్నది. 243 స్థానాలు ఉన్న బీహార్ అసెంబ్లీలో 125 స్థానాలు కైవసం చేసుకున్న ఎన్ డి ఏ కూటమి మళ్లీ అధికారంలోకి వచ్చింది.
అయితే మహా ఘట్ బంధన్ పేరుతో రంగంలో దిగిన ప్రతిపక్షాలు భారీగా సీట్లను కైవసం చేసుకున్నాయి. 110 స్థానాలతో ప్రతిపక్షం ఉండటం వృద్ధ నేత నితిష్ కుమార్ కు సవాల్ వంటిదే. అసెంబ్లీలో 75 స్థానాలు కైవసం చేసుకుని బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వీ యాదవ్ అతి పెద్ద పార్టీగా ఉన్నారు.
ముఖ్యమంత్రి అవుతాడని అందరూ భావించినా తేజస్వీ యాదవ్ కాలేకపోయాడు.