కృష్ణా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బుధవారం నాడు షార్ట్ ఫిల్మ్ “యిల్మ్ ” (చదువు) గోడ పత్రిక ఆవిష్కరించారు. బడుగు బలహీన వర్గాల మైనారిటీ విద్యార్థులు వారు అభ్యున్నతికి చదువుపై దృష్టి సారించాలి. రచయిత షరీఫ్ రచనలు కథలు వెనుకబడిన వర్గాలకు వెన్నుదన్నుగా ఉండటం వాస్తవానికి దగ్గరగా ఉండడటం తనకు ఆ కథలలో నచ్చిన అంశం.
డైరెక్టర్ ఫిరోజ్ చదువు ఆవశ్యకత పై తన మూడవ షార్ట్ ఫిల్మ్ తీయటం అభినందనీయం. గతంలో తన రెండు చిత్రాలు సామాజిక కోణంలో ప్రజల్ని చైతన్యాన్నినింపాయి. దీనికి సహకారం అందిస్తున్న మునీర్ సామాజిక సేవలు మైనారిటీల అభ్యున్నతికి కృషి అభినందనీయం.
ఈకార్యక్రమంలో మైనారిటీ నాయకులు అబ్దుల్ రహీం, న్యా యవాదులు మతీన్ ఖలీల్, ఇక్బాల్, డాక్టర్ రెహమాన్, ముస్లిం జర్నలిస్ట్ ఫోరమ్ కన్వీనర్ అబ్దుల్ అలీం, మైనారిటీ నేత ఫాజిల్ఉద్దీన్ తదితరులు పాల్గొన్నారు.