మంగళవారం సాయంత్రానికి నివర్ తీవ్ర తుపానుగా మారనున్నదని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో తీర ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. అలాగే మత్స్యకారులు వేటకు వెళ్లరాదన్నారు.
పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా కేంద్రీకృతం. రేపు సాయంత్రానికి పుదుచ్చేరి సమీపాన తీరందాటుతుందని వాతావరణ శాఖాధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ తుపాను ప్రభావం నేటినుంచి మూడు రోజుల పాటు దక్షిణాంధ్ర, రాయలసీమలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు
ఉత్తరాంధ్ర, తెలంగాణలకు ఓ మోస్తరు నుంచి చెదురు మదురుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.