చదువుకు చేయుత కార్యక్రమం లో హనుమకొండ బాలసముద్రం లోని భాగంగా పేద పిల్లలకు నోట్ బుక్స్, స్టేషనరీ ని జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వైస్ చైర్మన్ డాక్టర్ అనితా రెడ్డి అందచేశారు.
విద్య వలనే అభివృద్ధి సాధ్యం అని, పేదరికం విద్య కు ఎటువంటి ఆటంకం కారాదని ఈ సందర్భంగా అనితారెడ్డి అన్నారు. అందుకే ఈరోజు ప్రభుత పాఠశాల పిల్లలకు స్టేషణరీ అందించామని తెలిపారు. అనాధ, పేద, దివ్యాంగులకు, మహిళలకు చేయుతనందిస్తామని, విద్యా దానం మహ దానం అని అన్నారు.
జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ ఆద్వర్యంలో అవగాహన సదస్సులే కాక సేవా, సమాజ హిత కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ రాంరెడ్డి కూడా పాల్గొన్నారు.