కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో పంట మార్పిడిపై రైతులతో చర్చ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎంపిపి అశోక్ పటేల్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి రైతు పంట మార్పిడి చేసుకుని పప్పు దినుసులు,కూరగాయలు సాగు, జొన్నలు, పొద్దుతిరుగుడు పువ్వులు, వేరుశెనగలు లాంటి ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపాలన్నారు. కావున ప్రతి రైతు ప్రభుత్వాదేశాల మేరకు సహకరించాలని ఆయన సూచించారు.
కార్యక్రమంలో ఎంపిపి తోపాటు ఏడిఏ ఆంజనేయులు, వ్యవసాయ అధికారి పోచయ్య, మార్కెట్ కమిటీ అధ్యక్షులు మల్లిఖార్జున్, తెరాస అధ్యక్షులు వెంకట్రావు దేశాయి,రైతు సమన్వయ సమితి అధ్యక్షులు బసవరాజు పటేల్, కోఆప్షన్ సభ్యులు జావేద్ , మాజీ జడ్పీటీసీ సాయిరామ్ ,మార్కెట్ కమిటీ డైరెక్టర్ సుదర్శన్,ఆయా గ్రామాల సర్పంచ్లు ఎంపిటిసిలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
జి.లాలయ్య సత్యం న్యూస్ రిపోర్టర్ జుక్కల్ నియోజకవర్గం