38.2 C
Hyderabad
May 2, 2024 19: 55 PM
Slider నిజామాబాద్

కవిత ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం పై లండన్ ఎన్నారైల హర్షం

kavitha NRI

నిజామాబాద్  స్థానిక  సంస్థల  ఎమ్మెల్సీ తెరాస  పార్టీ  అభ్యర్థిగా మాజీ  ఎంపీ  కవితను ప్రకటించడం పట్ల లండన్  ఎన్నారైలు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ  జాగృతి  యూకే  అధ్యక్షుడు   సుమన్  బలమూరి, జాగృతి  యూకే  సభ్యుడు నేడు  నిజామాబాద్  మీడియాతో మాట్లాడారు. నిజామాబాద్ జిల్లా  అభివృద్ధి లో తనవంతు  కృషి  చేసిన  కవిత  ప్రజలతో  మమేకం  అవడానికి ఈ అవకాశం కలిసి వస్తుందని అన్నారు. పార్లమెంట్  ఎన్నికల్లో తామంతా లండన్  నుండి  వచ్చి  కవితకు ప్రచారం  చేశామని వారు గుర్తు  చేసుకున్నారు.

కవిత తెలంగాణ ఉద్యమంలో  తోటి  ఉద్యమ కారులకు  తోడ్పాటుగా  ఉంటూ తెలంగాణ సంస్కృతి  ప్రచారంలో  అగ్రగామిగా  ఉన్నారని వారన్నారు. గతేడాది   హైదరాబాద్ లో  జరిపిన  అంతర్జాతీయ  యువత  సదస్సు వల్ల  రాష్ట్రానికి ఎనలేని ఖ్యాతి తెచ్చిన ఘనత కూడా కవితకే దక్కుతుందని వారు తెలిపారు. కవిత  అభ్యర్థిత్వాన్ని  స్వాగతించి  సహకరిస్తున్న  జిల్లా  మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి,  జిల్లా  ఎమ్మెల్యే లకు,  ప్రజా  ప్రతినిధులకు   లండన్  ఎన్నారై  ల  తరపున  ధన్యవాదాలు తెలిపారు.

Related posts

పాజిటీవ్ కేసులు పెరిగినా ప్రజలు భయపడవద్దు

Satyam NEWS

శ్రీశైలం రిజర్వాయర్ కు పెరుగుతున్న వరద నీరు

Satyam NEWS

హైకోర్టు తీర్పును తెలంగాణ ప్రభుత్వం వెంటనే అమలు పరచాలి

Satyam NEWS

Leave a Comment