30.2 C
Hyderabad
February 9, 2025 19: 59 PM
Slider నిజామాబాద్

కవిత ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం పై లండన్ ఎన్నారైల హర్షం

kavitha NRI

నిజామాబాద్  స్థానిక  సంస్థల  ఎమ్మెల్సీ తెరాస  పార్టీ  అభ్యర్థిగా మాజీ  ఎంపీ  కవితను ప్రకటించడం పట్ల లండన్  ఎన్నారైలు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ  జాగృతి  యూకే  అధ్యక్షుడు   సుమన్  బలమూరి, జాగృతి  యూకే  సభ్యుడు నేడు  నిజామాబాద్  మీడియాతో మాట్లాడారు. నిజామాబాద్ జిల్లా  అభివృద్ధి లో తనవంతు  కృషి  చేసిన  కవిత  ప్రజలతో  మమేకం  అవడానికి ఈ అవకాశం కలిసి వస్తుందని అన్నారు. పార్లమెంట్  ఎన్నికల్లో తామంతా లండన్  నుండి  వచ్చి  కవితకు ప్రచారం  చేశామని వారు గుర్తు  చేసుకున్నారు.

కవిత తెలంగాణ ఉద్యమంలో  తోటి  ఉద్యమ కారులకు  తోడ్పాటుగా  ఉంటూ తెలంగాణ సంస్కృతి  ప్రచారంలో  అగ్రగామిగా  ఉన్నారని వారన్నారు. గతేడాది   హైదరాబాద్ లో  జరిపిన  అంతర్జాతీయ  యువత  సదస్సు వల్ల  రాష్ట్రానికి ఎనలేని ఖ్యాతి తెచ్చిన ఘనత కూడా కవితకే దక్కుతుందని వారు తెలిపారు. కవిత  అభ్యర్థిత్వాన్ని  స్వాగతించి  సహకరిస్తున్న  జిల్లా  మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి,  జిల్లా  ఎమ్మెల్యే లకు,  ప్రజా  ప్రతినిధులకు   లండన్  ఎన్నారై  ల  తరపున  ధన్యవాదాలు తెలిపారు.

Related posts

సినిమా టిక్కెట్ల ధర తగ్గింపు వద్దనేవారు పేదల వ్యతిరేకులే

Satyam NEWS

గుణపాఠం నేర్చుకుంటారా? కుట్ర రాజకీయాలు చేస్తారా?

Satyam NEWS

జగన్ లేఖపై సుప్రీంకోర్టు న్యాయవాదుల సంఘం ఖండన

Satyam NEWS

Leave a Comment