37.7 C
Hyderabad
May 4, 2024 14: 48 PM
Slider నిజామాబాద్

70 ఏళ్లు అణచివేసినా తెలంగాణా నేడు దేశంలో నెం.1 రాష్ట్రం

#PocharamSrinivasareddy

70 ఏళ్ల పాటు అణచివేసినా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తెలంగాణ దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఎదిగిందని బాన్సవాడ నియోజకవర్గ టీఆరెస్ పార్టీ ఇంచార్జి పోచారం సురేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఆరు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ అనితర సాధ్యమైన వ్యూహరచనతో, రైతుబంధు, రైతుభీమా వంటి ఎన్నో సంక్షేమపథకాలు ప్రవేశపెట్టి అభివృద్ధి చేశారని ఆయన అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కోటగిరి మండల కేంద్రంలో టీఆరెస్ పార్టీ జెండాను ఆవరిష్కరించిన సురేందర్ రెడ్డి పీఎస్‌ఆర్ యువసేన ఆధ్వర్యంలో స్థానికి ఎస్సీకాలనీలోని 130 కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి వనరులకు కొదవలేని తెలంగాణా ప్రాంతం స్వాతంత్రానికి ముందు, తరువాత కూడా దోపిడీకి గురైందే తప్ప ఏనాడు ఇక్కడి ప్రజలు ఆదరణకు నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ శంకర్ పటేల్,ఏఎంసీ చైర్మన్ గంగాధర్,వైస్ ఎంపీపీ గంగాధర్,జిల్లా కోఆప్షన్ మెంబర్ సిరాజ్,రైసస అధ్యక్షుడు కిషోర్ బాబు,మాజీ వైస్ ఎంపీపీ వల్లేపల్లి శ్రీనివాస్,కోటగిరి సొసైటీ చైర్మన్ కూచి సిద్ధు, మండల టీఆరెస్ పార్టీ అధ్యక్షుడు ఎజాస్ ఖాన్,పీయస్ఆర్ యువసేన సభ్యులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

రెడ్ ఎలర్ట్: కరోనా వైరస్ తో దేశంలో మూడో మరణం

Satyam NEWS

పొత్తులపై గందరగోళానికి తెరదించండి

Bhavani

ప్రజా ఉద్యమాలలో కీలక పాత్ర పోషించిన చింతలపూడి సరోజిని

Satyam NEWS

Leave a Comment