బిచ్కుంద మండలంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భవించి ఇరవై ఏళ్లు అయిన సందర్భంగా గ్రామ గ్రామానా పార్టీ అధ్యక్షులు తెరాస జెండాలను ఎగురవేసి పండగ ఉత్సవాలు నిర్వహించారు. మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో తెరాస అధ్యక్షులు వెంకట్రావ్ దేశాయి జెండాను ఎగురవేసి కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి బాటలో పయనించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపిపి అశోక్ పటేల్ ,సొసైటీ చైర్మన్ బాలాజీ ,జడ్పిటిసి భారతి రాజు ,సర్పంచ్ శ్రీరేఖ రాజు ,రైతు సమన్వయ సమితి అధ్యక్షులు బస్వరాజ్ పటేల్, ఎంపీటీసీలు చంద్రకళ రాజు, శాంతాబాయి ధన్సింగ్, సీనియర్ నాయకులు మహిపతి హనుమాన్లు సెట్, షేక్ పాషా సెట్, గణేష్ గొండ హాజీ లక్ష్మణ్ ,తెరాస నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.