33.7 C
Hyderabad
April 29, 2024 00: 37 AM
Slider నల్గొండ

ప్రజా ఉద్యమాలలో కీలక పాత్ర పోషించిన చింతలపూడి సరోజిని

#chintalapudi sarojini

భారత స్వాతంత్య్ర ఉద్యమ నాయకుడు,ప్రముఖ కమ్యూనిస్టు పార్టీ నేత  కామ్రేడ్ చింతలపూడి రాములు చేపట్టిన ప్రతి ఉద్యమంలో పరోక్షమైన పాత్ర ఆయన సతీమణి సరోజిని దే అని CPI రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గన్నా చంద్రశేఖర్ అన్నారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని సిపిఐ కార్యాలయం అనుముల లింగయ్య భవనంలో శనివారం CPI జిల్లా కార్యవర్గ సభ్యుడు యల్లావుల రాములు అధ్యక్షతన కామ్రేడ్ చింతలపూడి రాములు సతీమణి సరోజిని సంస్మరణ సభ జరిగింది.

ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీని ఈ ప్రాంతంలో బలోపేతం చేయడంలో కామ్రేడ్ చింతలపూడి రాములు జీవిత భాగస్వామిగా సరోజిని ఎంతగానో తోడ్పడ్డారని అన్నారు. గృహిణిగా బాధ్యతలు నెరవేరుస్తూ, ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా తన విధిని నిర్వర్తిస్తూ సామాజిక సేవా  కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారని అన్నారు.

పార్టీ కార్యకర్తలకు,నాయకులకు వెన్నుదన్నుగా నిలిచారని కొనియాడారు. ఎంతో మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపేలా అక్షర జ్యోతి వెలిగించి చైతన్యం కలిగించిన మహనీయులలో సరోజిని ఒకరని అన్నారు. ఆమె మృతి తీరని లోటని,నేటి మహిళలు సరోజిని టీచర్ ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ సీనియర్ నాయకులు మామిడి వెంకటేశ్వర్లు,సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పాలకూరి బాబు,ధూళిపాళ్ల ధనుంజయనాయుడు,యల్లావుల రమేష్,సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యుడు కంబాల శ్రీనివాస్,సిపిఐ పట్టణ కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు,ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు జడ శ్రీనివాస్,నాయకులు ఇందిరాల వెంకటేశ్వర్లు,సోమగాని కృష్ణ,గుండా రమేష్,జక్కుల రమేష్,మామిడి నర్సయ్య,కుక్కడపు బక్కయ్య,కుమ్మరికుంట్ల నాగేశ్వర్రావు,చింతలపూడి సరోజిని   కుటుంబ సభ్యులు, బంధువులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

విజయవాడలో డిగ్రీ విద్యార్థుల క్రికెట్ టోర్నీ

Bhavani

తమ పిల్లల ప్రవర్తన, అలవాట్ల పై తల్లిదండ్రులు కన్నేసి వుంచాలి

Satyam NEWS

సెలబ్రేషన్: వాలీబాల్ ఛాంపియన్ షిప్ క్యాంప్ ఫైర్

Satyam NEWS

Leave a Comment