ఒడిశా రాజకీయాల్లో లేడీ టీచర్ మమిత మెహర్ మర్డర్ కేసు ప్రకంపనలు రేపుతోంది. కలహండి జిల్లాలో టీచర్ హత్య కేసులో ప్రధాన నిందితుడు.. గోవింద్ సాహుకు రాష్ట్ర మంత్రి దివ్యశంకర్ మిశ్రా ఆశీస్సులు ఉన్నాయని విపక్షాలు ఆందోళనలు ఉధృతం చేశాయి.
మంత్రి దివ్యశంకర్ను బర్తరఫ్ చేసి అరెస్ట్ చేయాలన్న డిమాండ్ను అసెంబ్లీ లోపల, బయట కాంగ్రెస్ నేతలు ఆందోళనలు చేస్తున్నారు. భువనేశ్వర్లో ఆందోళనలు చేస్తున్న ఎన్ఎస్యూఐ కార్యకర్తలపై లాఠీఛార్జ్ చేశారు పోలీసులు. విద్యార్ధులు చేపట్టిన అసెంబ్లీ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
పోలీసుల లాఠీఛార్జ్లో చాలామంది కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. తలలు పగలడంతో ఆస్పత్రికి తరలించారు. లేడీ టీచర్ హంతకుడు సాహుకు హోంశాఖ సహాయమంత్రి దివ్యశంకర్కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.