36.2 C
Hyderabad
May 7, 2024 13: 28 PM
Slider రంగారెడ్డి

ఫ్లెక్సీ తొలగించమని చెప్పాం: అధికారులే బాధ్యులు

#singireddysereesha

ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ ఏఎస్ రావు నగర్ డివిజన్ కార్యాలయంలో ప్లెక్సీ తొలగించాలని అధికారులను కోరినప్పటికీ తొలగించ లేదని ఏఎస్ రావు నగర్ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. వాళ్లు కార్యాలయంలోని ఫ్లెక్సీ విషయంలో ఏర్పడిన వివాదం పై వివరణిస్తూ ప్రోటోకాల్ ప్రకారం వార్డు కార్యాలయంలో ఫ్లెక్సీ ఏర్పాటు చేయాలని అధికారులను కోరినప్పటికీ కోవిడ్ కారణంగా గతంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు తొలగించకుండా అలాగే ఉంచారని ఆమె వివరించారు.

కార్యాలయం ప్రారంభించిన తర్వాత ఇప్పటి వరకు సమావేశం నిర్వహించలేదని, దీంతో బోర్డు మార్చేందుకు వీలు కాలేదన్నారు. ప్రోటోకాల్ విషయంలో ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించాలని, ఇందులో భాగంగా నియోజకవర్గంలోని 10 డివిజన్ లలోని కార్యాలయాలలో స్థానిక ఎంపీ ఎనుముల రేవంత్ రెడ్డి ఫోటోలు కూడా జత చేయాలని ఆమె కోరారు. అన్ని అధికారిక కార్యక్రమాల్లో అందరూ ఫోటో కాల్ పాటించాలని ఆమె సూచించారు.

Related posts

ఇంటెలిజెన్స్ చీఫ్ గా పి వి సునీల్ కుమార్?

Satyam NEWS

మనుషుల్ని చంపే పనిలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం

Satyam NEWS

వడగళ్ల వానతో నష్టపోయిన పంటల్ని పరిశీలించిన స్పీకర్

Satyam NEWS

Leave a Comment