ప్రభుత్వ భూముల యథేచ్ఛగా కబ్జాలకు గురవుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ.. హిందూ దేవాలయాలను మాత్రం నోటీసులు ఇవ్వకుండా అధికారులు కూల్చడం పట్ల మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గాజులరామారంలోని దేవేందర్ నగర్ సుబ్రమణ్య స్వామి ఆలయంలో ఇటీవల అధికారులు కూల్చివేతలు చేయడంతో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ఆలయాన్ని సందర్శించి, కూల్చివేతలను పరిశీలించారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ ఆలయానికి ఇరువైపులా ప్రభుత్వ భూములు కబ్జాల పాలైన పట్టించుకోని అధికారులు హిందూ దేవాలయాల పట్ల మాత్రం తీవ్ర వివక్షతను చూపుతున్నాని అన్నారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ కనుసన్నల్లోనే ఈ కూల్చివేతలు జరిగాయని ఆరోపించారు. తాను ఎమ్మెల్యే గా ఉన్నపుడు ప్రభుత్వ భూములు కాపాడానని, ఇప్పుడున్న ఎమ్మెల్యే అనుచరులే ప్రభుత్వ భూములన్నీ కబ్జాలు చేసి మాయం చేశారన్నారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే తొమ్మిదేళ్ల లో చేసిన కబ్జాల చిట్టాను త్వరలోనే బయటపెడతామని, త్వరలోనే ప్రభుత్వ భూముల కబ్జాలపై పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని అన్నారు. హిందూ ఆలయాల జోలికి వస్తే ఊరుకునేది లేదని అధికారులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.