ఇతర రాష్ట్రాల నుంచి మధ్యం తీసుకుని వచ్చి ఆంద్రప్రదేశ్ మంగళగిరి ఎస్ఈబి అధికారులు అమ్మకాలు చేస్తున్న వారిని ఇద్దరు వ్యక్తులను, వారి వద్ద నుంచి (180 ml) ఆఫీసర్ చాయిస్ బ్రాండ్ 432 బాటిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. మధ్యప్రదేశ్ మధ్యం తీసుకుని వచ్చినట్లు సమాచారం రావటంతో మంగళగిరి ఎస్ఈబి మారయ్య బాబు ఆధ్వర్యంలో బృందం నిఘా ఏర్పాటు చేసి తెలంగాణా కు చెందిన ధరావత్ శ్రీకాంత్, మంగళగిరి పట్టణంకు చెందిన తెనాలి విజయ్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు. ఎస్సై మల్లిఖార్జున్, సిబ్బంది పద్మజ, హనుమంతు, శ్రీనివాసరావు, నాగరాజు, రమేష్ లు ఈ దాడిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐ మారయ్య బాబు ఎలాంటి సమాచారం ఇచ్చిన వారి సమాచారం గోప్యంగా ఉంచి ఆసాంఘీక పనులు చేసే వారిని అదుపులోకి తీసుకుంటామని తెలియజేశారు.
ఎం ఎస్ సుధాకర్, సత్యంన్యూస్. నెట్