33.2 C
Hyderabad
May 4, 2024 01: 40 AM
Slider తూర్పుగోదావరి

కోనసీమలో ఒమిక్రాన్ కేసు నమోదు

#omicran

కోనసీమలో మొదటి ఒమిక్రాన్ కేసు నమోదు అయింది. అయినవిల్లి మండలం నేదునూరి సావరం  గ్రామంలో ‌ఒమిక్రాన్ పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ నెల‌19వ తేదీన కువైట్ నుండి విజయవాడ మీదుగా కారులో వచ్చిన మహిళకు ఇది సోకినట్లు చెబుతున్నారు. ఆమె నుంచి గన్నవరం ఎయిర్ పోర్టులో సాధారణ కరోనా శాంపిల్ సేకరణ చేశారు. అక్కడ నుండి కోనసీమ వైద్యులకు ఈ మేరకు సమాచారం అందింది. వైద్యాధికారులు ఒమిక్రాన్  నిర్దారించారు. రెండు వాక్సిన్లు వేయించుకుని కువైట్ నుండి ఆ మహిళ బయలుదేరి వచ్చింది. అప్రమత్తం అయిన అధికారులు, కుటుంబ సభ్యులకు మరోసారి కరోనా పరీక్షలు నిర్వహించారు.

Related posts

నూతన రెవెన్యూ చట్టానికి మద్దతుగా రైతు ర్యాలీ

Satyam NEWS

ఆంగ్ల అధ్యాపకురాలు డాక్టర్ కొణిజేటి అరుణకుమారికి “విశ్వజననీ విద్యారత్న”

Bhavani

భీమ్లా నాయక్ సినిమా వేడుక వాయిదా

Satyam NEWS

Leave a Comment