కోనసీమలో మొదటి ఒమిక్రాన్ కేసు నమోదు అయింది. అయినవిల్లి మండలం నేదునూరి సావరం గ్రామంలో ఒమిక్రాన్ పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ నెల19వ తేదీన కువైట్ నుండి విజయవాడ మీదుగా కారులో వచ్చిన మహిళకు ఇది సోకినట్లు చెబుతున్నారు. ఆమె నుంచి గన్నవరం ఎయిర్ పోర్టులో సాధారణ కరోనా శాంపిల్ సేకరణ చేశారు. అక్కడ నుండి కోనసీమ వైద్యులకు ఈ మేరకు సమాచారం అందింది. వైద్యాధికారులు ఒమిక్రాన్ నిర్దారించారు. రెండు వాక్సిన్లు వేయించుకుని కువైట్ నుండి ఆ మహిళ బయలుదేరి వచ్చింది. అప్రమత్తం అయిన అధికారులు, కుటుంబ సభ్యులకు మరోసారి కరోనా పరీక్షలు నిర్వహించారు.