ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్ డివిజన్ వీ ఎన్ ఆర్ గార్డెన్స్ లో హైదరాబాద్ నగర మాజీ మేయర్ శ్రీ బొంతు రామ్మోహన్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథి ఆర్చ్ బిషప్ కార్డినల్ పూల ఆంతోని ప్రార్థనలతో ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరిగాయి. మాజీ మేయర్ రామ్మోహన్ మాట్లాడుతూ నిరుపేదలు కూడా సంతోషంగా పండుగ జరుపుకోవాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం అధికారికంగా పండుగలను నిర్వహిస్తుందని, పేద కుటుంబాల్లో ఆనందం కోసం కానుకలు అందిస్తుందని అన్నారు.
గతంలో ఏ ప్రభుత్వాలు చేయని విధంగా అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. తెలంగాణ పథకాలను కేంద్రంతో పాటు ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రాజేశ్వర్ రావు ,రామంతాపూర్ మాజీ కార్పొరేటర్ గంథం జోత్స్నా నాగేశ్వరావు,ఉప్పల్ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు,మాజీ ప్రజాప్రతినిధులు,వివిధ డివిజన్ల నాయకులు,క్రైస్తవ సోదర సోదరీమణులు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, మేడ్చల్ జిల్లా