28.7 C
Hyderabad
May 5, 2024 08: 39 AM
Slider నిజామాబాద్

విద్యుత్ షాక్ తో యువకుడి మృతి

#Current Shock

కామారెడ్డి జిల్లా జుక్కల్‌ మండలంలోని పడంపల్లి గ్రామంలో ఆదివారం రాత్రి జరిగిన పుట్టినరోజు వేడుకలలో ఎడ్ల లక్ష్మణ్ (20) విద్యుత్ షాక్తో మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు ఈ విధంగా వున్నాయి. బిచ్కుంద మండలంలోని రాజుల్లా గ్రామానికి చెందిన యువకుడు ఓ టెంట్ హౌస్ లో పనిచేస్తున్నాడు.

వృత్తిరీత్యా పడంపల్లి గ్రామంలో జరిగిన పుట్టినరోజు వేడుకలలో లైటింగ్ పని చేస్తుండగా అకస్మాత్తుగా విద్యుత్ షాక్ తో అక్కడికక్కడే మృత్యువాత పడ్డట్లు స్థానికులు తెలిపారు. యువకుడి మృత్యువాత సమాచారం విన్న ఆయన నివాసం స్థలం రాజుల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

తెల్లవారితే రాఖీ పండుగ ఉండగా ఆయన మృత్యువాత వార్తను ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు.వి షయం తెలుసుకున్న  జుక్కల్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బిచ్కుంద  ఆస్పత్రికి తరలించినట్లు రాజుల గ్రామస్తులు తెలిపారు.

Related posts

కుంటాల, పోచ్చెర జలపాతాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దండి

Satyam NEWS

విజయనగరం జిల్లా స్థాయి అధికారుల‌ను ప‌ట్టి పీడిస్తున్న మ‌హ‌మ్మారి

Satyam NEWS

అధ్యక్షా.. ఏదైనా సమస్య ఉంటే ఎవరితో చెప్పాలి?

Satyam NEWS

Leave a Comment