రాఖీ పండుగ సందర్భంగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, నల్గొండ పార్లమెంటు సభ్యుడు ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆయన సోదరి రాఖీ కట్టారు. ఇంట్లో మెట్లపై నుంచి జారి పడిన ఉత్తమ్ కుమార్ రెడ్డి విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలిసిందే.
ఆయన మోకాలికి అయిన గాయం కారణంగా ఆయన పార్టీ కార్యక్రమాలలో పాల్గొనడం లేదు. రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆయన సోదరి హితశ్రీ రాఖీ కట్టారు.