కడపజిల్లా చాపాడు మండలం కేతవరం గ్రామం వద్ద మోరిని కారు ఢీ కొనడంతో ఒకరు మరణించారు. మృతుడు ఖాజీపేట తవ్వారు పల్లె కు చెందిన రామ శేఖర్ రెడ్డి(42) గా గుర్తించారు. బ్రిడ్జిని కారు ఢీ కొనడంతో జరిగిన ఈ ఘటన లో మరణించిన వ్యక్తి ఖాజీపేట లో శ్రీ సాయి తేజ హైస్కూల్ కరెస్పాండెంట్ గా పనిచేస్తున్నాడు.